మనము తినే మాంసాహారాల్లో చేపలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు వీటిలో కొవ్వుశాతం తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, బి2, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ , మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య విషయంలో ఎంతో విలువైనవి. వీటిని అనేక ప్రాంతాలలో వారి వారి అభిరుచులకు తగినట్లుగా అనేక రకాలుగా వండుకుంటుంటారు. అందులో చేపల ఫ్రై ప్రధానమైనది. మనలో అనేకమందికి చేపల ఫ్రై అనగానే నోరూరుతుంది అంతగా ఇష్టపడుతారు దీనిని. కాబట్టి మనము చేపల ఫ్రై రుచిగా ఏ విధంగా తయారుచేయాలో
తెలుసుకుందాము.
మొదట మనం మంచి చేపలను ఎంపిక చేసుకుని నచ్చిన విధంగా ముక్కలుగా చేసుకోవాలి. మరీ పెద్దవిగా కాకుండా సన్ననివిగా చేసుకోవాలి ఎందుకనగా అలా వుంటే అవి త్వరగా వేగుతాయి. వాటిని శుభ్రంగా కడగాలి.
కడిగే విధానం (శుభ్రపరచు విధానం):
ఉప్పు మరియు పసుపుని చేపలకు పూసి కొన్ని నిమిషాలు పక్కన ఉంచి వ్యర్థాలు పోవునట్లు ముఖ్యంగా చేపల కడుపు లోపలి భాగాన్ని బాగా కడగాలి. శుభ్రపరచుటకు ఉప్పు మరియు పసుపుతోపాటు నిమ్మకాయ రసం కూడా ఉపయోగించవచ్చు.
కావల్సిన పదార్థాలు:
చేపలు 1 కిలోగ్రామ్
కారం పొడి
1
టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్
2 టీ
స్పూన్
జీలకర్ర పొడి
1 టీ స్పూన్
పసుపు
1/2 టీ
స్పూన్
ధనియాల పొడి
1 టీ స్పూన్
నిమ్మకాయ రసం
1 టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి)
2 టీ స్పూన్
ఉప్పు
తగినంత
తయారు చేయు విధానం:
మొదట ఒక పాత్ర తీసుకుని
దానిలో పైన చెప్పబడిన మోతాదులో (ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి) వేసి మొత్తం కలిపి మిక్స్ అయ్యేటట్లు కొన్ని నీళ్లు పోసి బాగా కలిపి దానిని గట్టిగా మసాలా పేస్ట్ వలె చేయాలి. ఒకవేళ కలర్ కావాలంటే Food colour వేసుకోవచ్చు. శుభ్రంగా కడిగిన చేపలను తీసుకుని మనం తయారు చేసిన మసాలా చేప ముక్కలకు అంటుకునే విధంగా కలిపి ఒక గంట సమయం
ఊరపెట్టాలి.
తరువాత పాన్ లో ముక్కలు మునుగునంతగా మంచి నూనె పోయాలి. నూనె బాగా మరిగిన తరువాత మనం ఊరపెట్టిన ముక్కలను నూనెలో వేసి చిన్న మంటమీద 5 నిమిషాలు వేగనిచ్చి తరువాత రెండవవైపు వేగునట్లు తిప్పాలి. అవి ఎరుపు రంగులోనికి వచ్చేవరకు వాటిని వేగనివ్వాలి. వేగిన తరువాత వాటిని తీసి ఒక బౌల్ లో
వేసుకోవాలి. మీరు కావాలనుకున్న చేపల ఫ్రై తయారయ్యింది. వాటిమీద కొద్దిగా నిమ్మరసం చల్లుకుని తిన్నట్లయితే చాలా రుచిగా ఉంటుంది.
ధన్యవాదాలు.
Comments
Post a Comment